పెనుబల్లి మండలంలో .. సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

పెనుబల్లి మండలంలో .. సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

పెనుబల్లి, వెలుగు: పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసిన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కర్రాలపాడు సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెండ్​అయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్​బుధవారం చర్యలు తీసుకున్నారు. ఉప సర్పంచ్​ఆళ్ల కృష్ణ సంతకం లేకుండా సర్పంచ్ రాయపూడి మల్లయ్య, పంచాయతీ సెక్రటరీ ఇందిర కలిసి రూ.6లక్షల44వేల490 పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారు. ఉప సర్పంచ్​ఫిర్యాదుతో గతనెల 9న డీఎల్​పీఒ ప్రభాకర్ విచారణ చేపట్టారు. అనంతరం కలెక్టర్​గౌతమ్ కు రిపోర్టు అందజేశారు. బుధవారం సర్పంచ్, సెక్రటరీని సస్పెండ్​చేస్తూ కలెక్టర్​ఉత్తర్వులు ఇచ్చారు. జీపీ ఫండ్స్ రికవరీ చేయాలని ఆదేశించారు.

మెదక్​లో ఇద్దరు సర్పంచులు..

మెదక్ జిల్లాలో ప్రొటోకాల్ పాటించని ఇద్దరు సర్పంచులు సస్పెండ్ అయ్యారు. నిజాంపేట మండలం జడ్చెరువు తండాలో పంచాయతీ భవనం, చిన్న శంకరంపేట మండలం చందంపేటలో పల్లె దవాఖాన ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్ పాటించలేదని అందిన ఫిర్యాదుతో మెదక్​కలెక్టర్​చర్యలు తీసుకున్నారు. ఆయా గ్రామాల సర్పంచులు రమావత్ అరుణ్ కుమార్, తాటికొండ శ్రీలతను సస్పెండ్ చేస్తున్నట్లు డీపీఓ ఉత్తర్వులను జారీ చేశారు.