
హైదరాబాద్, వెలుగు: ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) సత్ పాల్ భనూకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) చూస్తున్న ఫైనాన్షియల్, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, ఫంక్షన్స్ను జూన్ 8, 2025 నుంచి మూడు నెలల పాటు అప్పగించారు. ఫైనాన్స్ మినిస్ట్రీ లెటర్ ప్రకారం, భనూ ఈ బాధ్యతలను సెప్టెంబర్ 7, 2025 వరకు లేదా రెగ్యులర్ సీఈఓ పోస్ట్ స్వీకరించే వరకు లేదా తదుపరి ఆర్డర్స్ వచ్చే వరకు (ఏది ముందైతే అది) నిర్వర్తిస్తారు. సెబీ రూల్స్ ప్రకారం ఎల్ఐసీ ఈ వివరాలను స్టాక్ ఎక్స్చేంజ్లకు తెలియజేసింది.