సత్తయ్య సేవలను అన్ని రాష్ట్రాలకు విస్తరించాలి

సత్తయ్య సేవలను అన్ని రాష్ట్రాలకు విస్తరించాలి
  •     వీకేసీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తిరుమావలవన్
  •     ఘనంగా ట్రేడ్ యూనియన్ లీడర్​సత్తయ్య పదవీ విరమణ సభ

రామచంద్రాపురం, వెలుగు: అంబేద్కర్, ఫూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని వీకేసీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, తమిళనాడు ఎంపీ డాక్టర్ తిరుమావలవన్ అన్నారు. మను ధర్మాన్ని పాటించడమంటే నిమ్న వర్గాలను అణచి వేయడమేనన్నారు.  శుక్రవారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్​లో ట్రేడ్ యూనియన్​ నాయకుడు కొల్లూరి సత్తయ్య పదవీ విరమణ సభ జరిగింది. ఎంపీ తిరుమావలవన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

సత్తయ్య జీవిత చరిత్రపై ప్రముఖ రచయిత పసునూరి రవీందర్​రాసిన ‘మట్టి వేధావి’ అనే పుస్తకాన్ని ప్రొఫెసర్​ కంచె ఐలయ్యతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం తిరుమావలవన్ మాట్లాడుతూ.. దళితుల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి పెద్దలు చూపిన పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. కొల్లూరి సత్తయ్య ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సేవలను కొనియాడారు.