ఘనంగా పీరీల ఊరేగింపు

ఘనంగా పీరీల ఊరేగింపు

కాగజ్ నగర్/బజార్ హత్నూర్, వెలుగు: కాగజ్ నగర్ మండలం బారేగూడ గ్రామంలో హస్సన్ హుస్సేన్ ఆశిర్ ఖాన నుంచి డప్పు చప్పుళ్లు, అటపాటలతో పీరీలను ఘనంగా ఊరేగించారు. గ్రామస్తులు మొక్కులు చెల్లించుకున్నారు. బజార్ హత్నూర్ మండల కేంద్రంలో పీరీల పండుగ సందడి నెలకొంది.

ఐదు రోజులుగా అంతా కలిసి గుండం చుట్టూ దూలా ఆడుతూ, మొక్కులు తీర్చుకుంటున్నారు. గిర్నూర్ గ్రామంలో భారీ వర్షంలోనూ సవార్లను ఎగిరేశారు.

ALSO READ :శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆగస్టు మొత్తం శ్రీవారి పుష్కరిణి మూత