ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఫండ్స్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ వాటా అమ్మకం

ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఫండ్స్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ వాటా అమ్మకం
  • ఐపీఓ ద్వారా 6.3 శాతం విక్రయించనున్న బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ:  ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ మ్యూచువల్ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహించే  సంస్థ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఫండ్స్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)  వచ్చే ఏడాది  ఐపీఓ ద్వారా 10శాతం వాటాను అమ్మాలని నిర్ణయించింది. ఈ కంపెనీ ప్రమోటర్లు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ 6.3శాతం వాటాను (3.2 కోట్ల షేర్లను), ఆముండి ఇండియా హోల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3.7శాతం వాటాను (1.88 కోట్ల షేర్లను) విక్రయించనున్నాయి. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐకి  ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ కార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత మూడో లిస్టెడ్ సబ్సిడరీగా ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నిలవనుంది. 

దేశంలో అతిపెద్ద అసెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కంపెనీలలో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఒకటి. ఈ ఏడాది సెప్టెంబర్ ముగిసేనాటికి ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా  రూ.11.99 లక్షల కోట్ల అసెట్ అండర్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఏయూఎం),  ఆల్టర్నేటివ్ ఫండ్స్ ద్వారా  రూ.16.32 లక్షల కోట్ల ఏయూఎం కలిగి ఉంది. ఈ కంపెనీలో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐకి 61.91శాతం, ఆముండికి 36.36శాతం వాటా ఉంది.