ఎస్బీఐలో 13,455 మంది కొత్త ఉద్యోగులు

ఎస్బీఐలో 13,455 మంది కొత్త ఉద్యోగులు

న్యూఢిల్లీ: కస్టమర్లకు మరింత సమర్థవంతంగా సేవలను అందించడానికి బుధవారం 13,455 మంది జూనియర్ అసోసియేట్లను నియమించినట్లు ఎస్​బీఐ తెలిపింది. ఈ నియామకం ద్వారా 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఖాళీలను భర్తీ చేశామని పేర్కొంది. ఎంపిక ప్రక్రియ ఈ ఏడాది మార్చిలో జరిగిన ప్రాథమిక పరీక్షలతో ప్రారంభమైంది.  ఏప్రిల్ 2025లో ప్రధాన పరీక్షలు నిర్వహించారు. 

అసెస్​మెంట్​ తరువాత, 13,455 మంది అభ్యర్థులను జూనియర్​అసోసియేట్లుగా ఎంపిక చేశారు.  ఈ విషయమై ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ చైర్మన్  శెట్టి మాట్లాడుతూ, ప్రస్తుతం తమకు అన్ని కేటగిరీలలో సుమారు 18 వేల మందిని నియమించామని, వీరిలో సుమారు 13,500 మంది క్లర్కులు, మూడు వేల మంది ప్రొబేషనరీ అధికారులు ఉంటారని అన్నారు.