
న్యూఢిల్లీ: కస్టమర్లకు మరింత సమర్థవంతంగా సేవలను అందించడానికి బుధవారం 13,455 మంది జూనియర్ అసోసియేట్లను నియమించినట్లు ఎస్బీఐ తెలిపింది. ఈ నియామకం ద్వారా 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఖాళీలను భర్తీ చేశామని పేర్కొంది. ఎంపిక ప్రక్రియ ఈ ఏడాది మార్చిలో జరిగిన ప్రాథమిక పరీక్షలతో ప్రారంభమైంది. ఏప్రిల్ 2025లో ప్రధాన పరీక్షలు నిర్వహించారు.
అసెస్మెంట్ తరువాత, 13,455 మంది అభ్యర్థులను జూనియర్అసోసియేట్లుగా ఎంపిక చేశారు. ఈ విషయమై ఎస్బీఐ చైర్మన్ శెట్టి మాట్లాడుతూ, ప్రస్తుతం తమకు అన్ని కేటగిరీలలో సుమారు 18 వేల మందిని నియమించామని, వీరిలో సుమారు 13,500 మంది క్లర్కులు, మూడు వేల మంది ప్రొబేషనరీ అధికారులు ఉంటారని అన్నారు.