కారును ఢీకొన్న స్కూల్ బస్సు

కారును ఢీకొన్న స్కూల్ బస్సు

ఆంధ్ర ప్రదేశ్ విజయవాడ గవర్నర్ పేటలో స్కూల్ బస్సు కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి.  నగరంలోని పాత బస్టాండు సమీపంలో ఘటన జరిగింది. స్కూల్ బస్సు… కారును వేగంగా ఢీ కొట్టడంతో కారు వెళ్లి చెట్టుకు గుద్దుకుంది. ఘటనలో కారు నుజ్జు నుజ్జైంది. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో  20 మంది విద్యార్థులున్నారు. బస్సు డ్రైవర్ తో పాటు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.