స్కూల్ బస్సు బోల్తా..10మంది స్టూడెంట్స్ కు తీవ్రగాయాలు

స్కూల్ బస్సు బోల్తా..10మంది స్టూడెంట్స్ కు తీవ్రగాయాలు

స్కూల్ ​బస్సు బోల్తా పడిన ప్రమాదంలో పది మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. నల్గగొండ జిల్లా నార్కట్ పల్లి గ్రామానికి చెందిన మహాత్మ స్కూలు బస్సు ఆదివారం ఉదయం 66 మంది స్టూడెంట్లు, 8 మంది టీచర్లతో టూర్​కు రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి వచ్చింది. పర్వేద గ్రామ శివారులోని వైల్డ్​ వాటర్​పార్క్​ను చూసిన అనంతరం రాత్రి తిరిగి బయలు దేరారు. మొయినాబాద్​ మండలం చిల్కూరు గ్రామ సమీపంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో పది మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108లో స్థానిక భాస్కర ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి అందరిని స్వస్థలానికి పంపించినట్లు మొయినాబాద్ పోలీసులు తెలిపారు.