అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన స్కూలు బస్సు

అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన స్కూలు బస్సు

కామారెడ్డి జిల్లాలో ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని తాడ్వాయి మండలం, దేవాయిపల్లిలో వేగంగా వెళుతున్న ఓ ప్రైవేటు స్కూలు బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 32 మంది పిల్లలు ఉన్నారు.

అయితే ఈ ఘటనలో విద్యార్థులెవరికి గాయాలు కాలేదు. బస్సు పక్కకు ఒరిగిపోవడాన్ని గమనించిన స్థానికులు, రైతులు పిల్లలను బయటకు తీశారు. స్కూలు పిల్లలను తీసుకెళ్లేందుకు ఆ స్కూలు యాజమాన్యం పాత బస్సును వాడుతోందని… ఎన్నిసార్లు తాము ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు.