
- ఫిట్నెస్ టెస్టులకు వచ్చింది సగం వాహనాలే..
- రూల్స్ పాటించక రోడ్లపై తిరుగుతున్నవి 5 వేలకు పైనే
- ఇప్పటికే 350 బస్సులపై కేసులు
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్పరిధిలో స్కూల్బస్సుల ఫిట్నెస్పై ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యాసంస్థలు తెరిచే ముందే తమ వాహనాలను ఫిట్నెస్ టెస్టుకు తీసుకురావాల్సిందిగా నోటీసులు జారీ చేస్తే, 50 శాతం మాత్రమే ఫిట్ నెస్టెస్టులు చేయించుకుని సర్టిఫికెట్లు పొందారని అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ పరిధిలో1300 వాహనాలు ఉంటే 775, రంగారెడ్డిలో 6200 వాహనాలకు 4500 , మేడ్చల్ పరిధిలో 6100 వెహికల్స్కు 3200 మంది సర్టిఫికెట్లు పొందారని చెప్తున్నారు.
సగం వాహనాలకే ఫిట్నెస్సర్టిఫికెట్లు తీసుకోవడంతో వారం రోజులుగా స్కూల్ బస్సులపై ఆర్టీఏ స్పెషల్డ్రైవ్నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని వందల బస్సులపై కేసులు నమోదు చేశామని, కొన్ని వాహనాలను సీజ్చేసినట్టు అధికారులు తెలిపారు. గ్రేటర్లో తిరుగుతున్న స్కూల్బస్సుల్లో 15 ఏండ్లు పూర్తయినవి కూడా చాలా ఉన్నాయని అంటున్నారు. అయితే, కొందరు ఆఫీసర్లు స్కూల్యాజమాన్యాల నుంచి ముడుపులు తీసుకుని చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని, అందుకే అనేక విద్యాసంస్థలు ఫిట్నెస్ లేకపోయినా ధీమాగా బస్సులను రోడ్లపై తిప్పుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రూల్స్పాటిస్తలేరు..అందుకే
విద్యాసంస్థల వాహనాలు ఫిట్నెస్సర్టిఫికెట్పొందాలంటే కొన్ని ప్రమాణాలు తప్పని సరిగా పాటించాలి. వాహనాల్లో స్టూడెంట్స్సులభంగా ఎక్కి దిగడానికి మెట్ల అమరిక ఉండాలి. కిటికీల నుంచి చేతులు, తల బయట పెట్టకుండా జాలీలు ఏర్పాటు చేయాలి. బస్సులో ఫైర్సేఫ్టీ పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి. వెహికల్స్కు తప్పకుండా ఇన్సూరెన్స్ చేయించాలి. ఆర్టీఏకు పన్ను చెల్లించి ఉండాలి. బస్సు నడిపే డ్రైవర్ 60 ఏళ్ల లోపు వారై ఉండాలి. 15 ఏండ్లు దాటిన వాహనాలు రోడ్లపై తిప్పకూడదు. అయితే, ఇందులో చాలా నిబంధనలు పాటించడం లేదు కాబట్టే విద్యాసంస్థల యాజమాన్యాలు ఫిట్నెస్ టెస్టుకు రావడం లేదని తెలుస్తోంది. యాజమాన్యాలకు నోటీసులు ఇస్తున్నామని, రూల్స్పాటించకపోతే సీజ్చేస్తామని ఆర్టీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు.
349 కేసుల నమోదు
గ్రేటర్పరిధిలో ఫిట్నెస్ లేని స్కూల్బస్సులన్నీ గుర్తించేంత వరకు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని ఆర్టీఏ అధికారులు తెలిపారు. గ్రేటర్పరిధిలో మంగళవారం నాటికి 160 కేసులు నమోదు చేయగా బుధవారం, గురువారం కలిపి మరో 189 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ రెండు రోజుల్లో 1,223 వాహనాలను తనిఖీ చేశామన్నారు. ఇందులో 66 వాహనాల పత్రాలు సరిగ్గా లేవని, 199 వాహనాలపై రిఫ్లెక్టివ్టేప్స్లేవని గుర్తించినట్టు చెప్పారు. వీరి నుంచి కాంపౌండింగ్ ఫీజుల కింద రూ1.26 లక్షలు వసూలు చేసినట్టు అధికారులు తెలిపారు.