
స్టూడెంట్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది ఉత్తర్ ప్రదేశ్ సర్కార్. ఫస్ట్ క్లాస్ నుంచి 8వ క్లాస్ స్టూడెంట్ల వరకు పరీక్షలు రాయకున్నా పై క్లాసులకు ప్రమోట్ చేస్తామని ఆ రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. రాష్ట్రంలో మార్చి 23 నుంచి 28 వరకు యాన్యువల్ ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. కరోనా ఎఫెక్ట్తో పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిం ది. ఏప్రిల్ 2 దాకా అన్ని స్కూళ్లను మూసేస్తున్నట్టు వెల్లడించింది. పరీక్ష కేంద్రాల్లో స్టూ డెంట్లకు మధ్య కనీసం ఓ మీటర్ దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీబీఎస్ఈ సూచించింది. ఒకవేళ రూంలు చిన్నగా ఉంటే వేరే రూంలలో కూర్చోపెట్టాలని పేర్కొంది. ఇన్విజిలేటర్లు మాస్కులు పెట్టుకోవాలని చెప్పింది.