నేటి నుంచి తెరుచుకోనున్న విద్యాసంస్థలు

నేటి నుంచి తెరుచుకోనున్న విద్యాసంస్థలు

హైదరాబాద్, వెలుగు: వారం రోజుల సెలవుల తర్వాత సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో సర్కార్ రెండు విడతలుగా సెలవులు ఇచ్చింది. చివరగా ఈ నెల 8న విద్యాసంస్థలు కొనసాగగా, 9న రెండో శనివారం, 10న ఆదివారం హాలీడేస్ వచ్చాయి. ఆ తర్వాత వానలతో 11,12,13 తేదీల్లో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అయినా వర్షాలు తగ్గకపోవడంతో 14,15,16 వరకు పొడిగించింది. 17న ఆదివారం కావడంతో తిరిగి సోమవారం స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ కానున్నాయి. అన్ని స్కూళ్లు, కాలేజీలకు టీచర్లు, సిబ్బంది అటెండ్ కావాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. నీట మునిగిన స్కూళ్లుంటే స్టూడెంట్లకు క్లాసులు నిర్వహించొద్దని సూచించారు. అలాంటి చోట్ల వరద తొలగించేందుకు పారిశుధ్య కార్మికులకు సాయంగా ఉండాలని  టీచర్లకు ఆదేశాలిచ్చారు.