మరో మహమ్మారి రావొచ్చు .. సైంటిస్టుల హెచ్చరిక

మరో మహమ్మారి రావొచ్చు .. సైంటిస్టుల హెచ్చరిక

లండన్​: ప్రపంచాన్ని వణికించిన కరోనాను మించిన మరో వైరస్​ రాబోతున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. కరోనా ప్రభావం తగ్గినప్పటికీ.. అంతకుమించిన ప్రమాదం ముందుందని అలెర్ట్ చేస్తున్నారు. స్కై న్యూస్ నివేదిక ప్రకారం.. జంతువులనుంచి మానవులకు వ్యాప్తి చెందే మరో మహమ్మారి ప్రబలే అవకాశం ఉన్నదని యూకేకు చెందిన అంటువ్యాధుల నిపుణులు చెబుతున్నారు.  

ఏ సమయంలోనైన మరో మహమ్మారి పుట్టుకు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఏది జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని , అవసరమైతే త్యాగాలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.  గ్లోబల్ వార్మింగ్, అటవీ నిర్మూలన  వల్ల వైరస్ లు లేదా బ్యాక్టీరియా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రమాదం పొంచి ఉన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.