సింగపూర్ ఎయిర్లైన్స్ సబ్సిడరీ అయిన స్కూట్ ‘నెట్వర్క్ సేల్’ ను స్టార్ట్ చేసింది. ఈ నెల 18 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్, కోయంబత్తూర్, తిరువనంతపురం, తిరుచిరాపల్లి, విశాఖపట్నం సిటీల నుంచి ఆస్ట్రేలియా, బాలి, జేజు, లాంబొక్, ఒసాకా, తైవాన్, ఫిలిప్పీన్స్, సింగపూర్, వియత్నాంలకు వెళ్లాలనుకునే కస్టమర్లు తక్కువ రేటుకే టికెట్స్ పొందొచ్చని తెలిపింది. టికెట్ రేట్లు రూ.6,200 నుంచి ప్రారంభమవుతాయి.