
- సుప్రీం కోర్టుకు చెప్పిన సెబీ
- ఇంతకు ముందు ఇచ్చిన వివరాలు తప్పు
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ కంపెనీలపై 2016 తర్వాత ఎలాంటి దర్యాప్తూ జరపలేదని, ఇంతకు ముందు తాము ఇచ్చిన వివరాలు తప్పని సెబీ సోమవారం సుప్రీం కోర్టుకు తెలిపింది. హిండెన్బర్గ్ ఎపిసోడ్పై దర్యాప్తునకు తమకు మరికొంత టైము కావాలని సుప్రీం కోర్టును సెబీ కోరింది. దర్యాప్తు వేగంగా పూర్తి చేసే క్రమంలో ఏవైనా పొరపాట్లు జరిగితే, న్యాయపరమైన చిక్కులకు దారితీయొచ్చని పేర్కొంది.
హిండెన్బర్గ్ రిపోర్టు కొన్ని అదానీ గ్రూప్ ట్రాన్సాక్షన్లపై ఆరోపణలు చేసిందని, ఆ ట్రాన్సాక్షన్లు క్లిష్టమైనవి కావడంతోపాటు,వాటికి సబ్–ట్రాన్సాక్షన్లు కూడా ఉన్నాయని, మరోవైపు ఆ ట్రాన్సాక్షన్లన్నీ ఒకే దేశంలో జరిగినవి కావని సుప్రీం కోర్టుకు సెబీ వివరించింది. అదానీ గ్రూప్లోని లిస్టెడ్ కంపెనీలు రూల్స్ అతిక్రమించాయా? అనే విషయంపై విదేశాలలోని 11 రెగ్యులేటరీ ఏజన్సీలను ఇప్పటికే సమాచారం అడిగామంది.
అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ చాలా ఆరోపణలు చేసింది. అకౌంటింగ్ ఫ్రాడ్స్తోపాటు, షేర్ల ధరలలోనూ మానిప్యులేషన్ జరుగుతోందని ఆరోపించింది. ఈ అంశంలో దాఖలైన ఒక కేసులో సుప్రీం కోర్టు విచారణ మొదలెట్టింది. సోమవారం ట్రేడింగ్లో అదానీ గ్రూప్అన్ని షేర్లూ నష్టాలపాలయ్యాయి. అదానీ టోటల్ గ్యాస్ షేర్లు అత్యధికంగా 5 శాతం నష్టపోయాయి.