4 ఐపీఓలకు సెబీ గ్రీన్సిగ్నల్..

4 ఐపీఓలకు సెబీ గ్రీన్సిగ్నల్..

న్యూఢిల్లీ: వాటర్ ప్యూరిఫైయర్ కంపెనీ కెంట్ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ సిస్టమ్స్,  కరమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తారా ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సహా నాలుగు సంస్థలు ఐపీఓ  ద్వారా నిధులను సేకరించడానికి సెబీ అనుమతి పొందాయి.  ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్ కాంపోనెంట్స్ తయారీదారు మంగళ్​ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్,  వైండింగ్  కండక్టివిటీ ఉత్పత్తుల తయారీ సంస్థ విద్యా వైర్స్ ఐపీఓలకు కూడా అనుమతి లభించింది. 

ఈ సంస్థలన్నీ పబ్లిక్ ఆఫరింగ్స్​ ద్వారా కనీసం రూ. 2,500 కోట్లు సేకరించాలని భావిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఇవన్నీ తమ ప్రాథమిక ఐపీఓ పత్రాలను దాఖలు చేయగా, ఈ నెల 3–-6 తేదీలలో సెబీ అబ్జర్వేషన్లు పొందాయి. సెబీ పరిభాషలో అబ్జర్వేషన్లు రావడమంటే ఐపీఓకు అనుమతి వచ్చినట్టే భావిస్తారు.  ఈ కంపెనీల షేర్లు బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలో లిస్టవుతాయి.