
న్యూఢిల్లీ: వాటర్ ప్యూరిఫైయర్ కంపెనీ కెంట్ ఆర్ఓ సిస్టమ్స్, కరమ్తారా ఇంజనీరింగ్తో సహా నాలుగు సంస్థలు ఐపీఓ ద్వారా నిధులను సేకరించడానికి సెబీ అనుమతి పొందాయి. ట్రాన్స్ఫార్మర్ కాంపోనెంట్స్ తయారీదారు మంగళ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్, వైండింగ్ కండక్టివిటీ ఉత్పత్తుల తయారీ సంస్థ విద్యా వైర్స్ ఐపీఓలకు కూడా అనుమతి లభించింది.
ఈ సంస్థలన్నీ పబ్లిక్ ఆఫరింగ్స్ ద్వారా కనీసం రూ. 2,500 కోట్లు సేకరించాలని భావిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఇవన్నీ తమ ప్రాథమిక ఐపీఓ పత్రాలను దాఖలు చేయగా, ఈ నెల 3–-6 తేదీలలో సెబీ అబ్జర్వేషన్లు పొందాయి. సెబీ పరిభాషలో అబ్జర్వేషన్లు రావడమంటే ఐపీఓకు అనుమతి వచ్చినట్టే భావిస్తారు. ఈ కంపెనీల షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్టవుతాయి.