3 ప్రముఖ కంపెనీల ఐపీఓలకు సెబీ గ్రీన్ సిగ్నల్

3 ప్రముఖ కంపెనీల ఐపీఓలకు సెబీ గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షైన్ పిక్చర్స్, లూమినో ఇండస్ట్రీస్, ఎం అండ్​బీ ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఐపీఓల ద్వారా నిధులను సేకరించేందుకు సెబీ అనుమతి పొందాయి. ఈ మూడు కంపెనీలు జనవరి, ఫిబ్రవరిలో ఐపీఓ కోసం సెబీకి ప్రాథమిక పత్రాలను అందించాయి. ఈ నెల 9–13 తేదీల మధ్య తమ అబ్జర్వేషన్లను పొందాయి. సెబీ పరిభాషలో అబ్జర్వేషన్లు రావడమంటే పబ్లిక్ ఇష్యూలకు అనుమతి వచ్చినట్టుగానే భావిస్తారు. సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షైన్ పిక్చర్స్ ఇష్యూలో మొత్తం 83.75 లక్షల ఈక్విటీ షేర్ల ఆఫర్ సైజు ఉంది. వీటిలో 50 లక్షల షేర్ల ఫ్రెష్​ ఇష్యూ,  ప్రమోటర్ల ద్వారా 33.75 లక్షల షేర్ల ఆఫర్- ఫర్- సేల్ (ఓఎఫ్​ఎస్) ఉన్నాయి.  

కండక్టర్లు, పవర్ కేబుల్స్, పవర్ ఈపీసీ ప్రాజెక్టులను చేపట్టే ఈపీసీ కంపెనీ లుమినో ఇండస్ట్రీస్, తన తొలి పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.1,000 కోట్లను సమీకరించాలని చూస్తోంది. ఈ ఐపీఓలో రూ.600 కోట్ల విలువైన ఫ్రెష్​ ఇష్యూ, రూ.400 కోట్ల ఓఎఫ్​ఎస్ పోర్షన్​ ఉంటాయి. కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతాకు చెందిన ఈ కంపెనీ తాజా ఇష్యూ ద్వారా వచ్చే రూ.420 కోట్ల ఆదాయాన్ని అప్పులు తగ్గించడానికి ఉపయోగిస్తుంది.  రూ.15 కోట్లను మూలధనం కోసం వాడుతుంది. మిగిలినది సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగిస్తుంది.

ప్రీ- ఇంజనీర్డ్ బిల్డింగ్స్ (పీఈబీ) సెల్ఫ్-సపోర్టెడ్ రూఫింగ్ ప్రొవైడర్ అయిన ఎం అండ్ ​బీ ఇంజనీరింగ్, పబ్లిక్​ఇష్యూ ద్వారా రూ.653 కోట్లను సేకరించనుంది. గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఈ కంపెనీ ఐపీఓలో రూ.325 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల ఫ్రెష్​ ఇష్యూ, రూ.328 కోట్ల ఓఎఫ్​ఎస్ పోర్షన్​ ఉంటుంది. ఈ ఫ్రెష్​ఇష్యూ ద్వారా వచ్చే రూ.63.9 కోట్ల ఆదాయాన్ని పరికరాలు, యంత్రాలను కొనుగోలు చేయడానికి, రూ.60 కోట్లను అప్పు చెల్లింపుకు, రూ.110 కోట్లను కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడానికి, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం కేటాయించనుంది.