న్యూఢిల్లీ: ఐపీఓలలో దేశీయ సంస్థాగత పెట్టుబడిదారుల (మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, పెన్షన్ ఫండ్స్) భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో మార్కెట్ సెబీ యాంకర్ ఇన్వెస్టర్ల కోసం షేర్ల కేటాయింపు రూల్స్ను సవరించింది. యాంకర్ పోర్షన్ రిజర్వేషన్ను 33 శాతం నుంచి 40 శాతానికి పెంచింది.
ఇందులో 33 శాతం మ్యూచువల్ ఫండ్స్కు, మిగిలిన 7 శాతం ఇన్సూరెన్స్, పెన్షన్ ఫండ్స్కు ఉంటుంది. ఏడు శాతం వాటా సబ్స్క్రయిబ్ కాకపోతే, దానిని మ్యూచువల్ ఫండ్స్కు కేటాయిస్తారు. రూ. 250 కోట్లకు మించిన యాంకర్ పోర్షన్ ఉన్న ఐపీఓలకు యాంకర్ ఇన్వెస్టర్ల సంఖ్యను 10 నుంచి 15కు పెంచారు. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 30 నుంచి అమల్లోకి వస్తాయి.
