‘టక్కర్’ మూవీ నుంచి సెకండ్ సాంగ్

‘టక్కర్’ మూవీ నుంచి సెకండ్ సాంగ్

సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘టక్కర్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇప్పటికే టీజర్‌‌తో ఇంప్రెస్ చేసిన టీమ్.. ఒకసాంగ్‌‌ను కూడా విడుదల చేసింది. తాజాగా రెండో పాటను రిలీజ్ చేశారు.

‘పెదవులు వీడి మౌనం.. మధువులు కోరే వైనం.. తనువులు చేసే స్నేహం.. నేడే”  అంటూ సాగిన పాట ప్రేమ మైకంలో ముంచేసేలా ఉంది. నివాస్ కె ప్రసన్న కంపోజ్ చేసిన పాటకు కృష్ణకాంత్ క్యాచీ లిరిక్స్ రాశాడు. దీపక్ బ్లూ, చిన్మయి శ్రీపాద కలిసి పాడిన పాటలో సిద్ధార్థ్, దివ్యాంశ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విఘ్నేష్ కాంత్ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈనెల 26న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.