పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ వైఎంసీఏలో ట్రాన్స్ జెండర్లు, దివ్యాంగులు, ఎంఎస్ఎం, సీఎస్డబ్ల్యూ సభ్యులు కలిసి సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఐ నీడ్ హెల్ప్ ఎన్జీవో ట్రస్టీ జాకబ్ చిన్నప్ప ఆధ్వర్యంలో వైఎంసీఏ సికింద్రాబాద్, యూపీఎఫ్ హైదరాబాద్ సహకారంతో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో జాయ్ చెరియన్, విద్యావేత్త శ్రావంతి, రిటైర్డ్ అడిషనల్ డీజీపీ బాబురావు, వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు జయాకర్ డేనియల్, సికింద్రాబాద్ ప్రధాన కార్యదర్శి లియోనార్డ్ పాల్గొన్నారు.
