స్కూటీపై టీవీలతో తిరుమలకు.. అలిపిరి సెక్యూరిటీ నిద్రపోతుందా

స్కూటీపై టీవీలతో తిరుమలకు.. అలిపిరి సెక్యూరిటీ నిద్రపోతుందా

తిరుమల అలిపిరి తనిఖీ కేంద్రంలో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. తనిఖీలు లేకుండానే స్కూటీపై రెండు టీవీలను ఇద్దరు వ్యక్తులు తిరుమలకి తీసుకువచ్చారు. జీఎన్సీ వద్ద ద్విచక్ర వాహనాల తనిఖీల్లో భాగంగా కానిస్టేబుల్ వారిని ఆపారు. అయితే వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చి.. వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిదగ్గర ఏముందని చెక్ చేయగా.. టీవీలు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. 46 ఇంచుల టీవీలను ఉత్తర ప్రదేశ్ కు చెందిన ముస్లీంలు తిరుమలకు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు.

అయితే అలిపిరి వద్ద తమకు ఎలాంటి తనిఖీలు చేయలేదంటూ ఉత్తరప్రదేశ్ వ్యక్తులు చెప్పారు. తిరుమలలోని పలు ప్రదేశాల్లో సెకండ్ హ్యాండ్ టీవీలు అమ్మకాలు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.