
హైద్రాబాద్, వెలుగు : కోటక్ మ్యూచువల్ ఫండ్ హైదరాబాద్లోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) భాగస్వామ్యంతో, పెట్టుబడిదారులకు ‘సీఖో పైసో కి భాషా’ పేరుతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. టీచర్లకు ఆర్థిక విషయాలపై అవగాహన కల్పించడానికి దీనిని చేపట్టింది. హైదరాబాద్లోని 2,925 మంది టీచర్లకు ఆర్థిక అక్షరాస్యత కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యం. వీరిలో 50శాతం మంది మహిళలు ఉంటారని అంచనా. కార్యక్రమంలో భాగంగా సెంటర్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ సెషన్లు నిర్వహిస్తోందని కోటక్ మ్యూచువల్ ఫండ్ తెలిపింది.