పెట్టుబడులపై అవగాహనకు ‘సీఖో పైసో కి భాషా’

పెట్టుబడులపై అవగాహనకు ‘సీఖో పైసో కి భాషా’

హైద్రాబాద్, వెలుగు :  కోటక్ మ్యూచువల్ ఫండ్ హైదరాబాద్‌‌‌‌లోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్​ఈ) భాగస్వామ్యంతో,  పెట్టుబడిదారులకు  ‘సీఖో పైసో కి భాషా’ పేరుతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. టీచర్లకు ఆర్థిక విషయాలపై అవగాహన కల్పించడానికి దీనిని చేపట్టింది.  హైదరాబాద్‌‌‌‌లోని 2,925 మంది టీచర్లకు ఆర్థిక అక్షరాస్యత కల్పించడం  ఈ కార్యక్రమం లక్ష్యం. వీరిలో 50శాతం మంది మహిళలు ఉంటారని అంచనా. కార్యక్రమంలో భాగంగా సెంటర్ ఫర్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ సెషన్లు నిర్వహిస్తోందని కోటక్ మ్యూచువల్ ఫండ్ తెలిపింది.