సీత ప్రయాణం కృష్ణతో..నవంబర్ 14న రిలీజ్

సీత ప్రయాణం కృష్ణతో..నవంబర్ 14న రిలీజ్

రోజా భారతి, దినేష్, సుమంత్, అనుపమ లీడ్ రోల్స్‌‌‌‌లో దేవేందర్‌‌‌‌‌‌‌‌ తెరకెక్కించిన చిత్రం ‘సీత ప్రయాణం కృష్ణతో’. రాజీవ్, రోజా భారతి నిర్మించారు.  శరవణ వాసుదేవన్ సంగీతం అందించాడు. ఈ నెల 14న సినిమా విడుదలవుతున్న సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో  హీరోయిన్ రోజా భారతి మాట్లాడుతూ ‘నన్ను నమ్మి అందరు ఈ సినిమా వాళ్లది అని అనుకుని పనిచేసారు కాబట్టే ఇవాళ రిలీజ్ వరకు రాగలిగాం. 

ఎమోషనల్‌‌‌‌ కంటెంట్‌‌‌‌ను ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌గా ప్రజెంట్ చేశాం. చక్కని మెసేజ్ కూడా ఉంది. కచ్చితంగా అందరినీ ఆకట్టుకునే సినిమా అవుతుందనే నమ్మకముంది’ అన్నారు.  ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన నిర్మాతలకు దినేష్,  రాఖి శర్మ థ్యాంక్స్‌‌‌‌ చెప్పారు. వినోదాత్మకంగా సాగే ఫ్యామిలీ సినిమా అని దర్శకుడు దేవేందర్, నిర్మాత రాజీవ్ తెలియజేశారు.