పాండ్యాకు దరిదాపుల్లో ఎవరూ లేరు: సెహ్వాగ్

పాండ్యాకు దరిదాపుల్లో ఎవరూ లేరు: సెహ్వాగ్

న్యూఢిల్లీ: టాలెంట్‌ విషయంలో ఆల్ రౌండర్​ హార్దిక్​ పాండ్యా కు ఇండియా టీమ్‌ లో మరెవరూ దరిదాపుల్లో కూడా లేరని మాజీ ఓపెనర్‌ సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. ఈ మధ్యకాలంలో అద్భుతంగా ఆడుతున్న హార్దిక్‌ టీమ్‌ లో తన స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేని పరిస్థి తి కల్పించాడని  అన్నాడు. ‘మూడు విభాగాల్లో సత్తా చాటే కొందరు  ఆటగాళ్లను బీసీసీఐ ఎంచుకుంది. కానీ, టాలెంట్‌ విషయంలో వారిలో ఎవ్వరూ పాండ్యాకు కనీసం దగ్గరగా కూడా లేరు. అలా ఉన్నట్టయితే హార్దిక్‌ మళ్లీ టీమ్‌ లోకి వచ్చే వాడు కాద’ని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు