తెలంగాణ సోయి ఉన్నోళ్ల పేర్లు పంపు..ఇద్దాం

తెలంగాణ సోయి ఉన్నోళ్ల పేర్లు పంపు..ఇద్దాం

దళితబంధు రావట్లేదన్న సర్పంచ్​తో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి  

కొమురవెల్లి, వెలుగు: కేసీఆర్ కు ఓట్లు వేసే వారికే దళిత బంధు ఇస్తామని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం కొమురవెల్లిలో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంసాగర్ సర్పంచ్ తాడూరి రవీందర్ తమ గ్రామానికి దళిత బంధు రాలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనికి ఎమ్మెల్యే సమాధానమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వీటి గురించి ఆలోచించి తెలంగాణ సోయితో కేసీఆర్ కు ఓటు వేసే వాళ్లకే దళితబంధు అమలు చేస్తామన్నారు. ఇందులో ఎలాంటి దాపరికం లేదని, ఇది ఓపెన్ సీక్రెట్ అని వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ సోయి అంటే అర్థమైంది కదా...అలాంటి సోయి ఉన్నవాళ్లెవరైనా మీ ఊర్లో ఉంటే ఒకటి రెండు పేర్లు పంపించు చేద్దాం’ అని బదులిచ్చారు.