న్యాయంకోసం పోలీస్‌స్టేషన్‌కెళ్లిన సీనియర్ నటుడు నరేష్

న్యాయంకోసం పోలీస్‌స్టేషన్‌కెళ్లిన  సీనియర్ నటుడు నరేష్

తనకు న్యాయం చేయాలంటూ దివంగత నటీమణి విజయ నిర్మల కొడుకు, సీనియర్ నటుడు నరేష్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కీస్టోన్ అనే కంపెనీని నడుపుతున్న లింగం శ్రీనివాస్ అనే వ్యక్తి.. తమ కటుంబంతో ఉన్న పరిచయాన్ని అడ్డంపెట్టుకొని ఏడున్నర కోట్లు అప్పుగా తీసుకున్నాడని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ డబ్బులు తీసుకొని ఆరేండ్లు దాటినా.. ఇప్పటికీ ఇవ్వడం లేదని.. అడిగితే తప్పించుకు తిరుగుతున్నాడని నరేష్ పోలీసులకు తెలిపారు. ఏడున్నర కోట్లకు వడ్డీతో కలిపితే తనకు దాదాపు 10 కోట్లు రావాలని ఆయన అన్నారు. కాగా.. ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే తనకు న్యాయం జరిగేలా చూస్తారని నమ్మకముందని ఆయన అన్నారు.