
టెహ్రాన్: ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) సీనియర్ ఆఫీసర్, జనరల్ మొహ్సెన్ రెజాయీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఇరాన్పై ఇజ్రాయెల్ న్యూక్లియర్ అటాక్ చేస్తే.. ఇజ్రాయెల్పై పాకిస్తాన్ న్యూక్లియర్ అటాక్ చేసి ప్రతీకారం తీర్చుకుంటుందని వెల్లడించారు. ఇజ్రాయెల్పై అణు బాంబుతో దాడి చేస్తామని పాకిస్తాన్ ఇప్పటికే తమకు హామీ ఇచ్చిందని స్పష్టం చేశారు. ఇరాన్లో ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొహ్సెన్ రెజాయీ చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి.
"మా దేశంపై ఇజ్రాయెల్ అణ్వాయుధాలను ఉపయోగిస్తే.. ఇజ్రాయెల్పై అణ్వాయుధ దాడి చేస్తామని పాకిస్తాన్ హామీ ఇచ్చింది. ఇరాన్ వద్ద రహస్య యుద్ధ వ్యూహాలు ఉన్నాయి. సరిపడినంతా ఆయుధ సామగ్రి ఉంది. అవసరమైతే అన్నింటినీ ఉపయోగిస్తాం. మేం ఇప్పటివరకు 1.5 టన్నుల వార్హెడ్స్తో మిస్సైళ్లను ఉపయోగించాం. మరింత శక్తివంతమైనవి కూడా మా వద్ద ఉన్నాయి" అని మొహ్సెన్ రెజాయీ వివరించాడు. ఇజ్రాయెల్పై ఇరాన్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.