సెన్సెక్స్ ​260 పాయింట్లు జంప్​

 సెన్సెక్స్ ​260 పాయింట్లు జంప్​
  • 77 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

ముంబై:    సెన్సెక్స్,  నిఫ్టీ మూడు రోజుల నష్టాలకు బ్రేకులేశాయి. ఇవి బుధవారం సానుకూలంగా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ వంటి బ్లూచిప్​షేర్ల  ర్యాలీతో సెన్సెక్స్ 260.74 పాయింట్లు పెరిగి 80,998.25 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 349.78 పాయింట్లు పెరిగి 81,087.29కి చేరుకుంది. ఎన్​ఎస్ఈ నిఫ్టీ 77.70 పాయింట్లు పెరిగి 24,620.20 వద్ద ముగిసింది. సెన్సెక్స్ కంపెనీల్లో ఎటర్నల్ 3.32 శాతం పెరిగింది. భారతీ ఎయిర్‌‌‌‌టెల్, ఇండస్‌‌‌‌ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, టాటా స్టీల్,  హిందుస్తాన్ యూనిలీవర్ లాభపడ్డాయి. 

బజాజ్ ఫిన్‌‌‌‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టైటాన్  లార్సెన్ అండ్​ టర్బో నష్టపోయిన వాటిలో ఉన్నాయి.  బీ​ఎస్ఈ మిడ్‌‌‌‌క్యాప్ గేజ్ 0.76 శాతం, స్మాల్‌‌‌‌క్యాప్  0.58 శాతం పెరిగింది. సెక్టోరల్​ ఇండెక్స్​లలో బ్యాంకెక్స్,  రియల్టీ మాత్రమే వెనుకబడ్డాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర 0.14 శాతం పెరిగి బ్యారెల్​కు 65.72 డాలర్లకు చేరుకుంది.  ఎఫ్​ఐఐలు మంగళవారం రూ. 2,853.83 కోట్ల ఈక్విటీలను అమ్మారు.