
- 77 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
ముంబై: సెన్సెక్స్, నిఫ్టీ మూడు రోజుల నష్టాలకు బ్రేకులేశాయి. ఇవి బుధవారం సానుకూలంగా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి బ్లూచిప్షేర్ల ర్యాలీతో సెన్సెక్స్ 260.74 పాయింట్లు పెరిగి 80,998.25 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 349.78 పాయింట్లు పెరిగి 81,087.29కి చేరుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 77.70 పాయింట్లు పెరిగి 24,620.20 వద్ద ముగిసింది. సెన్సెక్స్ కంపెనీల్లో ఎటర్నల్ 3.32 శాతం పెరిగింది. భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, హిందుస్తాన్ యూనిలీవర్ లాభపడ్డాయి.
బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టైటాన్ లార్సెన్ అండ్ టర్బో నష్టపోయిన వాటిలో ఉన్నాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ గేజ్ 0.76 శాతం, స్మాల్క్యాప్ 0.58 శాతం పెరిగింది. సెక్టోరల్ ఇండెక్స్లలో బ్యాంకెక్స్, రియల్టీ మాత్రమే వెనుకబడ్డాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర 0.14 శాతం పెరిగి బ్యారెల్కు 65.72 డాలర్లకు చేరుకుంది. ఎఫ్ఐఐలు మంగళవారం రూ. 2,853.83 కోట్ల ఈక్విటీలను అమ్మారు.