స్టాక్ మార్కెట్లలో మోడీ మానియా కొనసాగుతోంది. ప్రదానిగా రెండోసారి మోడీ ప్రమాణ స్వీకారం చేయటంతో లాభాల బాట పట్టిన మార్కెట్లు… అదే జోరును కంటిన్యూ చేస్తున్నాయి. ఇవాళ ఉదయం భారీ లాభాలతో మొదలైన స్టాక్స్ …. 40 వేల పాయింట్ల మార్క్ ను దాటాయి. నిఫ్టీ 64 పాయింట్లు లాభపడి 12 వేల పాయింట్ల మార్క్ ను క్రాస్ చేశాయి. సెన్సెక్స్ 190 పాయింట్లు లాభపడి… 40వేల పాయింట్ల ఎగువన ట్రేడ్ అవుతున్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 69 పాయింట్ 75గా కొనసాగుతోంది.
#UPDATE: Sensex touches 40,018.24, up by 186.27 points. https://t.co/JRsohzooih
— ANI (@ANI) May 31, 2019