ఇంక 4 రోజులే.. రూ.2 వేల నోట్ల డిపాజిట్​కు గడువు

ఇంక 4 రోజులే.. రూ.2 వేల నోట్ల డిపాజిట్​కు గడువు

న్యూఢిల్లీ:  రూ.రెండు వేల నోటును బ్యాంకుల్లో డిపాజిట్​ చేయడానికి ఇంకా నాలుగే రోజులు గడువు ఉంది. ఇప్పటికీ దాదాపు రూ. 24,087 కోట్ల విలువైన నోట్లు చెలామణిలో ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది మే 19న రూ. 2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది.

వాటిని మార్చుకోవడానికి లేదా బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి సెప్టెంబర్ చివరి వరకు గడువు ఇచ్చింది. మొత్తం  రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.రెండు వేల నోట్లలో ఈ నెల ఒకటో తేదీ నాటికి ఏడు శాతం నోట్లు చెలామణిలో ఉన్నాయని ఆర్​బీఐ వర్గాలు తెలిపాయి.