పీయూష్ జైన్ కేసు: రెయిడ్‌‌ చేస్తానంటున్న బాలీవుడ్ హీరో

పీయూష్ జైన్ కేసు: రెయిడ్‌‌ చేస్తానంటున్న బాలీవుడ్ హీరో

ముంబై: ఇప్పటికే నాలుగైదు సినిమాలు చేస్తున్నాడు అజయ్ దేవగన్. వాటిలో ఓ సినిమాని తనే డైరెక్ట్ చేస్తున్నాడు కూడా. మరోవైపు ‘రుద్ర’ వెబ్ సిరీస్‌‌తో డిజిటల్ ఎంట్రీ కూడా ఇస్తున్నాడు. ఇంత బిజీగా ఉండి కూడా కొత్త ప్రాజెక్టుల్ని లైన్‌‌లో పెడుతున్నాడు. వాటిలో ‘రెయిడ్’ మూవీ సీక్వెల్ ఒకటి. 2018లో రాజ్‌‌కుమార్ గుప్తా డైరెక్షన్‌‌లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్టయ్యింది. అప్పటి నుంచి సీక్వెల్‌‌పై చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికి అది ఫిక్సయ్యిందని నిర్మాత కుమార్‌‌‌‌ మంగత్ పాఠక్ కన్‌‌ఫర్మ్ చేశారు.

మొదటి పార్ట్‌‌ని ప్రముఖ సిక్కు వ్యాపారవేత్త సర్దార్ ఇందర్‌‌‌‌సింగ్‌‌ ఇంటిపై జరిగిన ఇన్‌‌కమ్‌ ‌ట్యాక్స్ రెయిడ్స్ ఆధారంగా తీశారు. సెకెండ్ పార్ట్‌‌ని కాన్పూర్‌‌‌‌కి చెందిన పర్‌‌‌‌ఫ్యూమ్‌‌ వ్యాపారి పీయూష్ జైన్‌‌ ఇంటిపై జరిగిన రీసెంట్ రెయిడ్ ఆధారంగా తీయనున్నారు. ఈ ఐటీ దాడుల్లో  రూ.257 కోట్ల క్యాష్, 25 కిలోల బంగారం, 250 కిలోల వెండి దొరకడంతో జైన్ అరెస్టయ్యాడు. అదంతా ఈ మూవీలో చూపించనున్నారు. అప్పటిలాగే ఈసారి కూడా అజయ్ ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్ ఆఫీసర్‌‌‌‌గా కనిపించను న్నాడు. అతని భార్య పాత్రలో ఇలియానా కంటిన్యూ అవుతుందా లేదా మరొకరిని తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.