
గోదావరిఖని, వెలుగు: తల్లిని కరోనా గండం నుంచి గట్టెక్కించిన కొడుకు ఆ వైరస్కు బలయ్యాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చంద్రశేఖర్నగర్కు చెందిన పి.శారద స్థానిక ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఏఎన్ఎంగా చేస్తున్నారు. పేషెంట్లను చూసే క్రమంలో ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది. వైరస్ బారిన పడిన తల్లి బాగోగులు కొడుకు ఇంద్రకాంత్(25) చూసుకున్నాడు. ఈ క్రమంలో ఆమె కోలుకోగా అతడికి పాజిటివ్ వచ్చింది. 20 రోజుల కిందట కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించగా ట్రీట్మెంట్ తీసుకున్నాడు. నెగెటివ్ రిపోర్ట్ వచ్చినా లంగ్స్ ఎఫెక్ట్ కావడంతో ఊపిరి తీసుకోవడం కష్టమైంది. శనివారం రాత్రి చనిపోయాడు.