ప్రకాశం జిల్లా: కురిచేడులో మద్యం దొరక్క శానిటైజర్ తాగి మృతిచెందిన వారి సంఖ్య 9కి చేరింది. శుక్రవారం ఉదయం వరకు ఏడుగురు చనిపోగా..మధ్యాహ్ననికి మరో మరో ఇద్దరు మరణించారని తెలిపారు పోలీసులు. కురిచేడు మండల కేంద్రంలోని అమ్మవారి ఆలయం వద్ద ఉండే యాచకులు మద్యానికి బానిసలై.. కొన్ని రోజులుగా శానిటైజర్లు తాగుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. గురువారం రాత్రి కడుపులో తీవ్ర మంటతో ఓ వ్యక్తి చనిపోయాడు. మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటుండగా స్థానికులు 108కు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి అతనిని దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. వీరితో పాటు కురిచేడులోని పోలీస్ స్టేషన్ సమీపంలో నివాసం ఉండే కడియం రమణయ్య శానిటైజర్ లో నాటు సారా కలిపి తాగి చనిపోయాడు.
కురిచేడులో శానిటైజర్ తాగి అనారోగ్యానికి గురైన వారిలో శుక్రవారం ఉదయం మరో నలుగురు మృతి చెందారు. మృతులు.. అనుగొండ శ్రీను బోయ(25), భోగేమ్ తిరుపతయ్య (37), గుంటక రామిరెడ్డి (60), కడియం రమణయ్య (30), కొనగిరి రమణయ్య (65), రాజారెడ్డి (65), బాబు (40), ఛార్లెస్ (45), అగస్టీన్ (47) గా గుర్తించారు. కరోనా నేపథ్యంలో గత 10 రోజులుగా మద్యం దుకాణాలు తెరుచుకోక పోవడంతో .. యాచకులు, స్థానికులు శానిటైజర్ తాగుతున్నారని గ్రామస్థులు తెలిపారు.
కరోనా కేసులు పెరగడంతో కురిచేడు ప్రాంతంలో లాక్డౌన్ విధించారు. దీంతో మద్యం దొరక్క పలువురు శానిటైజర్ కు అలవాటుపడుతున్నారని తెలిపారు పోలీసులు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. చుట్టుపక్కల విక్రయిస్తున్న శానిటైజర్లను సీజ్ చేసి పరీక్షలకు పంపుతున్నామన్నారు. శానిటైజర్ డైరెక్టర్ గా తాగారా..వేరే ద్రవంతో కలిపి తాగారా అనేది పరిశీలిస్తున్నామని తెలిపారు ఎస్పీ.