గంజాయి తరలిస్తున్న ఏడుగురు అరెస్ట్

గంజాయి తరలిస్తున్న ఏడుగురు అరెస్ట్

తొగుట, రాయపోల్, వెలుగు : గంజాయి తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను అరెస్ట్​చేసి వారి దగ్గరి నుంచి 825 గ్రాముల గంజాయి, 5 బైక్ లు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ లతీఫ్ తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదివారం రాయపోల్ ఎస్ఐ సిబ్బందితో అనాజిపుర్ కొత్తపల్లి ఎక్స్ రోడ్డు వద్ద వాహన తనిఖీ చేస్తుండగా ఐదు బైక్​లపై ఏగుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు.

పట్టుకొని విచారించగా బ్యాగరి స్వామి (21) భద్రాచలం దగ్గరలోని కందిగూడెం నుంచి కిలోగంజాయి తెచ్చి కోనేరు మహేశ్​, గొల్ల రాజు, బాకీ రాజు, పంజాల అనిల్, దేవుడి కృష్ణమూర్తి, క్యమిద్రి వంశీకి  సమానంగా పంచాడు. పది గ్రాముల గంజాయి రూ.300 లకు అమ్మడానికి వెళ్లే సమయంలో పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. వీరందరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.