రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్​దే : షబ్బీర్​అలీ​ 

రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్​దే : షబ్బీర్​అలీ​ 
  •     ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ​ 

కామారెడ్డి, వెలుగు : తెలంగాణ రాష్ర్టాన్ని అప్పుల పాలు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్​కే దక్కిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ విమర్శించారు.  మంగళవారం భిక్కనూరు మండల కేంద్రంలోని పంక్షన్​హాల్​లో  కాంగ్రెస్​ కార్యకర్తల మీటింగ్​ జరిగింది. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన పలువురు బీఆర్​ఎస్ కు​రాజీనామా చేసి షబ్బీర్​అలీ సమక్షంలో కాంగ్రెస్​లో జాయిన్​ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్​ఎస్​ అభివృద్ధి ఏమోగానీ అప్పులపాలు మాత్రం చేసిందన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు5 గ్యారంటీలు అమలు చేశామని, రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ త్వరలోనే చేస్తామన్నారు. పార్లమెంట్​ఎన్నికల్లో బీఆర్ఎస్​ పార్టీని  బొందపెట్టాలన్నారు.  

ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్​అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్​ఎంపీ అభ్యర్థి సురేశ్​షెట్కార్, లీడర్లు ఎడ్ల రాజిరెడ్డి,  భీంరెడ్డి,  గాల్​రెడ్డి, చంద్రకాంత్​రెడ్డి, ఇంద్రకరణ్​రెడ్డి, దయాకర్​రెడ్డి పాల్లొన్నారు