హైదరాబాద్, వెలుగు: దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను కస్టడీకివ్వాలని కోరుతూ షాద్నగర్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితులను అరెస్టు చేసిన రోజు టైంలేక పూర్తిగా విచారించలేక పోయామని అందులో పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులు మహ్మద్ అలియాస్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవుల నుంచి కీలక ఆధారాలు సేకరించాల్సి ఉందన్నారు. బాధితురాలికి మద్దతుగా ప్రజలు ఆందోళన చేయడంతో నిందితుల నుంచి ఎవిడెన్స్సేకరించలేకపోయామని కోర్టుకు తెలిపారు. బాధితురాలి ఫోన్ను రికవరీ చేయాలని, నిందితుల స్టేట్మెంట్స్రికార్డ్ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. సీన్ రీకన్స్ స్ట్రక్షన్తో పాటు నిందితుల నేరచరిత్ర, సైంటిఫిక్ ఎవిడెన్స్సేకరించేందుకు నిందితులను పది రోజుల కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు.
క్రైమ్సీన్లో సెక్యూరిటీ ఎందుకు పెట్టలే..
బాధితురాలిని దహనం చేసిన ప్లేస్తో పాటు హైవేపై సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదని కోర్టు పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ విచారణ సందర్భంగా జడ్జి ఈ కామెంట్స్ చేశారు. నిందితుల అరెస్టు తర్వాత జరిగిన ప్రజా ఆందోళనను ప్రస్తావిస్తూ.. కస్టడీకి అప్పగిస్తే ఎక్కడ విచారిస్తారని కోర్టు ప్రశ్నించింది. విచారణ సందర్భంగా లా అండ్ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జడ్జి ఆదేశించినట్లు సమాచారం. దీనిపై మంగళవారం విచారణ జరిపి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు.
నిందితుల తరఫున వాదించబోం
దిశ కేసులో నిందితులకు న్యాయ సహాయం చేయబోమని షాద్నగర్ బార్ అసోసియేషన్తో పాటు రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ కూడా తీర్మానం చేశాయి. ఈ కేసును వీలైనంత త్వరగా ఫాస్ట్ట్రాక్ కోర్టుకు తరలించాలని కోరారు. బాధితురాలి ఫొటోతో వందల సంఖ్యలో లాయర్లు ర్యాలీ తీశారు. మరోవైపు, కస్టడీ పిటిషన్ వేయడానికి పోలీసులు వచ్చారని తెలిసి జనం కోర్టు ముందు ఆందోళన చేశారు. నిందితులను వెంటనే ఉరి తీయాలంటూ నినాదాలు చేశారు.