షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే మెయిన్ లీడ్ లో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పఠాన్. జాన్ అబ్రహాం ఇందులో విలన్ గా నటిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ ఈ మూవీ జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్ లో భాగంగా మేకర్స్ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 2 నిమిషాల 34 సెకన్లు ఉన్న ఈ మూవీ ట్రైలర్ ని చూస్తుంటే దేశభక్తి కథాంశంలో ఈ సినిమా తెరకెక్కినట్టుగా అర్థం అవుతోంది.
‘ఒక సైనికుడు తనకోసం దేశం ఏం చేసిందని అడగడు.. దేశం కోసం తాను ఏం చేయగలనా అని ఆలోచిస్తాడు’ అని షారుక్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సంస్థలో తెరకెక్కిన 50 వ చిత్రం పఠాన్ అవుతుండటం విశేషం. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.