
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, నటి దీపికా పదుకొణె జంటగా నటిస్తోన్న చిత్రం 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఇప్పుడు చరిత్ర సృష్టించడానికి సిద్దం అవుతోంది. ఈ మూవీ ఐసీఈ థియేటర్ ఫార్మాట్ (ఇమ్మర్సివ్ సినిమా ఎక్స్పీరియన్స్) లో విడుదల కానుంది. ఈ ఫార్మాట్ లో రిలీజ్ అవుతోన్న తొలి భారతీయ చిత్రంగా పఠాన్ నిలువనుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను రిలీజ్ చేయనుంది.
"ప్రేక్షకులకు అద్బుతమైన అనుభూతిని అందించడానికి ఐసీఈ ఫార్మాట్లో విడుదలైన మొదటి భారతీయ చిత్రం పఠాన్ అవుతుందని మేము గర్విస్తున్నాము" అని యశ్ రాజ్ ఫిల్మ్స్ వైస్ ప్రెసిడెంట్ రోహన్ మల్హోత్రా తెలిపారు. 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' మూవీ స్క్రీనింగ్తో ఇండియాలో ఈ ఫార్మాట్ ప్రారంభమైంది. కాగా, పఠాన్ చిత్రం జనవరి 25 న భారీ అంచనాలతో హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన మొదటి పాట ‘బేషరమ్ రంగ్’ విమర్శలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే.