గ్యాప్ ఇవ్వలా.. వచ్చింది అంటూ వరుసగా మూడు సినిమాలు అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేసిన షారుఖ్ ఖాన్.. వాటి షూటింగ్స్తో బిజీబిజీగా ఉన్నాడు. ముఖ్యంగా అట్లీ డైరెక్షన్లో నటిస్తున్న ‘జవాన్’ సినిమాని పరుగులెత్తిస్తున్నాడు. రీసెంట్గా చెన్నై షెడ్యూల్ని కూడా కంప్లీట్ చేసేశాడు. ఈ విషయాన్ని అట్లీనే స్వయంగా కన్ఫర్మ్ చేశాడు. ‘ఇది నా కెరీర్లోనే మెమొరబుల్ షెడ్యూల్. చెన్నైలో షూటింగ్ చేసినందుకు థాంక్యూ సర్. వేల కుటుంబాలు దీని వల్ల లాభపడ్డాయి. కింగ్ ఎప్పుడూ కింగే. లవ్యూ సర్’ అంటూ ట్వీట్ చేశాడు.
త్వరలోనే ముంబైలో మరో షెడ్యూల్ మొదలు కానుంది. ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. విజయ్ సేతుపతి విలన్గా కనిపించబోతున్నాడు. వీళ్లిద్దరితో కలిసి పని చేయడం చాలా బాగుందంటూ రీసెంట్గా షారుఖ్ కూడా చెప్పాడు. ముప్ఫై రోజుల పాటు చెన్నైలో ఆతిథ్యాన్ని ఎంజాయ్ చేశానంటూ తన సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రియమణి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో యోగిబాబు, సునీల్ గ్రోవర్, సాన్యా మల్హోత్రా ఇతర ముఖ్య పాత్రలు చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.