భారత మేధావి షేక్ షా సులేమాన్‌.. ఆయన సాధించిన విజయాలు ఇవే..!

భారత మేధావి షేక్ షా సులేమాన్‌.. ఆయన సాధించిన విజయాలు ఇవే..!

షేక్ మొహమ్మద్ ఉస్మాన్.. జాన్​పూర్ బార్​లో లీడింగ్ లాయర్. ఆయన కొడుకే షా సులేమాన్‌. మొదట్నించీ సులేమాన్​కు చదువంటే మక్కువ.1906లో జరిగిన బి.ఎ పరీక్షలో పాస్ అయి ఎన్నో పతకాలు గెలుచుకున్నారు.1906లో షా సులేమాన్  యునైటెడ్ ప్రావిన్స్ స్టేట్ స్కాలర్​షిప్​కు ఎంపికై, ఆ ఏడాదే కేంబ్రిడ్జికి వెళ్లారు.1909లో ఆయన గణిత శాస్త్ర ‘ట్రిపోస్’ను,1910లో ‘లా ట్రిపోస్​’ను పొందాడు.1909లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్ష కూడా రాశారు. కానీ, ఎంపిక కాలేదు. దాంతో డబ్లిన్ యూనివర్సిటీలో చదివి ఎల్​ఎల్​డి పట్టా అందుకున్నారు.

1911లో  డా. షా సులేమాన్ ఇండియాకు తిరిగి వచ్చారు. తన తండ్రి వద్ద జూనియర్​గా ఏడాదిపాటు ప్రాక్టీస్ చేశారు.1912లో అలహాబాద్​కు మారారు. అక్కడ షేర్​కోట్ కాళి, బంగాళీ, ధరంపూర్, బిల్వాల్ కేసుల్లో బారిష్టర్​గా తొలి విజయాలు అందుకున్నారు. అలా ఆయనకు 34 ఏండ్ల వయసులో ‘బెంచ్’ సీటు ఆఫర్ వచ్చింది. షా వల్లే సంయుక్త రాష్ట్రాలలో ‘ది ప్రి–ఎంషన్​ లా’ నిర్మాణం జరిగింది. ఆయన 43వ ఏట చీఫ్​ జస్టిస్, 46వ ఏట అలహాబాద్ హైకోర్ట్​ శాశ్వత చీఫ్​ జస్టిస్ అయ్యారు. 

ఐదేండ్ల తర్వాత ఫెడరల్ కోర్ట్​కు ఎలివేట్ అయ్యారు. 1934లో అలహాబాద్​లో దయాల్– బాగ్ పారిశ్రామిక ప్రదర్శనను స్టార్ట్ చేయాలని హైకోర్ట్​ చీఫ్ జస్టిస్ సర్​ షా​ని దయాల్– బాగ్ మోడల్ ఇండస్ట్రీస్, ఆగ్రా అధినేత సర్ ఆనంద్ సరూప్ సహాబ్​జీ మహరాజ్​ కోరారు. ఆ సందర్భంగా షాను ఉద్దేశించి ‘ప్రపంచ వ్యాప్త గౌరవం పొందిన భారత మేధావి’ పొగిడారు. 

విజయ పరంపర

  • 1930 పెషావర్ అల్లర్ల గురించి ఎంక్వైరీ చేయడానికి ‘పెషావర్ ఎంక్వైరీ కమిటీ’ని నెలకొల్పారు. సులేమాన్ ఆ కమిటీలో సీనియర్ మెంబర్​. ఆయన చేసిన సిఫార్సులను ప్రభుత్వం ఆచరణలో పెట్టింది.     
  • లార్డ్ మ్యూనెడిన్, లార్డ్ టామిన్లతోపాటు ‘క్వాపిటేషన్ రేట్స్ ట్రైబ్యునల్​’లో సభ్యుడిగా షా చేసిన​ సిఫార్సుల వల్లే ఇంగ్లండ్ ప్రభుత్వం, భారత సైన్యం ఖర్చులో కొంత భరించడానికి ఒప్పుకుంది. 
  • మీరట్ కుట్ర కేసు మెజిస్ట్రేట్ కోర్టులో రెండేండ్లు, సెషన్స్​ కోర్టులో నాలుగేండ్లు ఉంది. హైకోర్టులో అప్పీల్​ మీద వాదనలు కొన్ని నెలలు జరగొచ్చు అనుకున్నారు. కానీ, ఆ అప్పీల్​లో హియరింగ్, తీర్పు అన్నీ 8 రోజుల్లో పూర్తయ్యాయి. చీఫ్ జస్టిస్​గా సర్​ షా ఇచ్చిన తీర్పు భారతదేశ జ్యుడీషియల్​ అడ్మినిస్ట్రేషన్ చరిత్రలోనే ఒక గీటురాయి. 

    
అలహాబాద్​లో ‘ముస్లిం హై స్కూల్​’ ‘మదర్సా – ఇ – సుభానియా’ స్థాపకులలో ఒకడు సులేమాన్​.1928లో సాహెబ్​ జాదా అఫ్తాబ్​ అహ్మద్ ఖాన్, డా. జా ఉద్దీన్ అహ్మద్​ల మధ్య వివాదం రహ్మతుల్లా ఎంక్వైరీ కమిటీ ఏర్పాటుకి దారితీసింది. ఆ కమిటీ సభ్యులు ఆచరణకు దూరమైన మార్పులను సిఫార్సు చేశారు. ఆ సమయంలోనే యూనివర్సిటీ వైస్​ – ఛాన్స్​లర్​ అయిన సర్​ షా అన్ని రూల్స్, రెగ్యులేషన్స్6 నెలల కాలంలోనే ఆధునిక అవసరాలకు, రహ్మతుల్లా కమిటీ సిఫార్సులకు అనుగుణంగా క్రమబద్ధీకరించారు. ఆయన చేసిన ప్రయత్నాల వల్ల1929 సెప్టెంబర్​లో గవర్నమెంట్​ ఇండియా15 లక్షల గ్రాంటును ఇచ్చింది. 
    

  • ఆయన పరిపాలనా కాలంలో బోధనా సిబ్బందిని 55 ఏండ్ల వరకు కాంట్రాక్ట్​ లోనే రావాలని, ఎక్కువ గంటలు పనిచేయాలని కోరారు. ఆర్థిక సమర్థతతో వాటర్ వర్క్స్, వ్యవసాయ, సాంకేతిక సంస్థ, హౌజింగ్​ అసెస్​మెంట్ లాంటి స్కీంలను ప్రవేశపెట్టారు.     
  • అలీగఢ్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్​లర్​గా వారాంతాల్లో పారితోషికం తీసుకోకుండా పనిచేశారు. యూనివర్సిటీ కోర్టు ఆయనకు పూర్తి అధికారాలను (కార్టే బ్లాంకే) ఇచ్చింది. సర్​ షా ఢిల్లీ ఆంగ్లో – అరబిక్ కాలేజీ అధ్యక్షుడి కూడా సేవలందించారు.     
  • 1936లో లెజిస్లేచర్​ సభ్యుల ప్రశ్నలకు జడ్జిల జ్యుడీషియల్ పనులు, అఫీషియల్​ రిసీవర్స్ నియామకం గురించి జవాబు ఇవ్వడానికి సర్​ షా తిరస్కరించడం యునైటెడ్ ప్రావిన్స్​లో చరిత్ర సృష్టించిన సంఘటన

- మేకల మదన్​మోహన్​ రావు,కవి, రచయిత-