శాకుంతలం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

శాకుంతలం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

శాకుంతలం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిన అమేజాన్ ప్రైమ్ ఈ మేరకు ప్రకటన కూడా రిలీజ్ చేసింది. స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో పౌరాణిక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ దర్శకుడు ఇంతకుముందు తెరకెక్కించిన రుద్రమదేవి మంచి విజయాన్నే అందుకుంది. ఆదేరకంగా ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని అందరూ అనుకున్నారు. ఆ నమ్మకంతోనే నిర్మాత దిల్ రాజు కూడా కొంత పెట్టుబడి పెట్టారు.  

కానీ శాకుంతలం రిజల్ట్ వారికి షాకిచ్చింది. దిల్ రాజు స్వయంగా ఈ మాట అనడం గమనార్హం. తన 25 ఏళ్ల కెరీర్ లో శాకుంతలం బిగ్గెస్ట్ షాక్ అనడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.  దాదాపు అరవై కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కనీసం ఇరవై కోట్లు కూడా రాబట్టలేదని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లిస్టులోకి చెరిపోయింది.  నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా తీవ్రంగా నష్టపోయారు. సమంత కూడా తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టి మరీ ప్రమోషన్స్ చేసింది. కానీ ఫలితం దక్కలేదు.

ఇక సినిమాలో ఏదైనా పాజిటివ్ పాయింట్ ఉంది అంటే.. అది  అల్లు అర్హనే. ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. బాల భరతుడి పాత్రలో చాలా బాగా నటించింది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో శకుంతల పాత్రలో సమంత నటించగా.. దుష్యంతుడిగా దేవ్ మోహన్ కనిపించాడు. మోహన్ బాబు, అనన్య నాగళ్ల, సచిన్ ఖేడ్కర్, గౌతమ్, మధుబాల కీలక పాత్రలను పోషించారు. ఇక ఈ సినిమాను గుణశేఖర్ తనయ నీలిమ గుణతో కలిసి దిల్ రాజు నిర్మించాడు