
నలుగురు రౌడీ షీటర్లు సహా 48 మంది, నలుగురు ట్రాన్స్జెండర్లు అరెస్ట్
శంషాబాద్, వెలుగు: సిటీ శివారులోని ఓ ఫాంహౌస్లో అర్ధరాత్రి తర్వాత నిర్వహించిన ముజ్రా పార్టీలో పాల్గొన్న నలుగురు రౌడీషీటర్లు సహా 48 మందిని, నలుగురు ట్రాన్స్జెండర్లను శంషాబాద్ ఎస్ఓటీ, రూరల్ పోలీసులు అరెస్ట్చేశారు. వారి వివరాల ప్రకారం.. మైలర్ దేవ్ పల్లికి చెందిన బాబాఖాన్పై పోలీసులు ఇటీవలే రౌడీ షిట్ఎత్తేశారు. శంషాబాద్ మండలం రమంజాపూర్ గ్రామంలోని ఓ ఫాంహౌస్లో శనివారం అర్ధరాత్రి బాబా ఖాన్ ముజ్రా పార్టీని ఏర్పాటు చేశాడు. ఆదివారం తెల్లవారుజాము వరకు డీజే శబ్దాలు వస్తుండడంతో స్థానికులు శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు, రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థలానికి చేరుకున్న పోలీసులు నిర్వాహకుడు సహా 48 మందిని, నలుగురు ట్రాన్స్ జెండర్లను అరెస్ట్చేశారు. 4 కత్తులు, 5 హుక్కా పాట్లు, 49 సెల్ ఫోన్లు, 12 బైకులు, 4 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్అయిన వారిలో రౌడీ షీటర్లు అయిన అజార్, మహబూబ్, యాసీన్, సోహైల్ఉన్నారు.