2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయను : ఎన్సీపీ అధినేత శరద్ పవార్

2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయను :  ఎన్సీపీ అధినేత శరద్ పవార్

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ను పార్టీ నేతలు కోరడంతో తన నిర్ణయాన్ని ప్రకటించారు. అక్టోబర్ 19న పార్టీ సమీక్షా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాబోయే రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఎన్సీపీ అధినేత అన్ని ఊహాగానాలకు స్వస్తి పలికారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ 2024లో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. పార్టీ సమీక్షా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. పశ్చిమ, ఉత్తర మహారాష్ట్రలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్టీ సన్నాహాలను పరిశీలించేందుకు సమావేశం నిర్వహించారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా పార్టీ నేతలు పవార్‌ను కోరినట్లు సమాచారం. ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే, రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్, ఇతర సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిండోరి, అహ్మద్‌నగర్, హింగోలి, వార్ధా, అమరావతి, బీడ్, భివండి, జల్నా స్థానాల్లో సన్నాహాలను ఎన్సీపీ అధినేత సమీక్షించారు.