ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా.. 

ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా.. 

చైత‌‌‌‌‌‌‌‌న్య రావు, భూమి శెట్టి జంట‌‌‌‌‌‌‌‌గా న‌‌‌‌‌‌‌‌టించిన చిత్రం ‘ష‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌తులు వ‌‌‌‌‌‌‌‌ర్తిస్తాయి’. కుమార‌‌‌‌‌‌‌‌స్వామి(అక్షర‌‌‌‌‌‌‌‌) ద‌‌‌‌‌‌‌‌ర్శక‌‌‌‌‌‌‌‌త్వంలో  నాగార్జున సామ‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజ‌‌‌‌‌‌‌‌ల్లు నిర్మించారు. మార్చి 15న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌కి నటుడు ప్రియదర్శి, దర్శకుడు వేణు ఊడుగుల అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.

చైతన్య రావు మాట్లాడుతూ ‘ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ చూసే సినిమా ఇది.  మా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గుర్తుండిపోతుంది’ అని అన్నాడు. ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రమిది అంది భూమి శెట్టి. కుమారస్వామి మాట్లాడుతూ ‘కరీంనగర్ నేపథ్యంగా చేసిన ఈ సినిమాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు. ఇందులో ప్రతి క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుర్తుండిపోతుందని నిర్మాతలు చెప్పారు. దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, డీవోపీ శేఖర్ పోచంపల్లి,  మ్యూజిక్ డైరెక్టర్ అరుణ్ చిలువేరు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.