ఇయ్యాల గజ్వేల్​లో షర్మిల టూర్

ఇయ్యాల గజ్వేల్​లో షర్మిల టూర్

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ స్కీమ్ లు అందట్లేదని ఇటీవల ఆందోళన చేసిన గజ్వేల్ నియోజకవర్గంలోని తీగుల్ గ్రామంలో శుక్రవారం వైఎస్సార్​టీపీ చీఫ్ షర్మిల పర్యటించనున్నారు. తమ గ్రామం వచ్చి దళితబంధు పథకంలో అక్రమాలపై ప్రశ్నించాలని షర్మిలను కోరుతూ తీగుల్ ప్రజలు గురువారం వైఎస్సార్​టీపీ ఆఫీసుకు వచ్చారు. పార్టీ నేత నీలం రమేశ్ కు వినతిపత్రం ఇచ్చి షర్మిలకు అందజేయాలని కోరారు. 

ఈ నేపథ్యంలో షర్మిల పర్యటనను అడ్డుకుంటామని లోకల్ బీఆర్ఎస్ లీడర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో తన టూర్ కు భద్రత కల్పించాలని పోలీసులను షర్మిల కోరారు. “సీఎం ఇలాకా లో జరిగిన అక్రమాలు భయటపడతాయని బీఆర్ఎస్ పార్టీకి భయం పట్టుకుంది. సొంత నియోజకవర్గంలో ఓడిపోతాననే కేసీఆర్ తన పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నరు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా నా పోరాటం ఆగదు. దళితబంధు పథకంలో తీగుల్ గ్రామ ప్రజలకు జరిగిన అన్యాయం తెలుసుకోవడం నా బాధ్యత”అని గురువారం ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్​పార్టీ ఆఫీసుల పేరిట వేల కోట్ల భూమిని అప్పనంగా కొట్టేశారని మండిపడ్డారు.