షారూఖ్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. జవాన్ మూవీ వాయిదా

షారూఖ్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. జవాన్ మూవీ వాయిదా

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్, తమిళ దర్శకుడు అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘జవాన్’. చాలా గ్యాప్ తరువాత రీసెంట్ గా ‘పఠాన్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న షారుఖ్ ఖాన్.. అదే స్పీడ్ లో ‘జవాన్’తో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని  పక్కా ప్లాన్ తో ఉన్నాడు. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు అట్లీ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుండి విడులైన వీడియోకి ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కి చేరుకున్నాయి.

ఇక ఈ సినిమా జూన్ 2న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. కానీ.. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా విడుదల వాయిదా పడనుందట. అది కూడా దాదాపు రెండు నెలల పాటు. దానికి కారణం ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ప్లాన్ చేసాడట అట్లీ. ఈ సన్నివేశాలకు సంబంధించి VFX వర్క్‌  పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందట. ఆడియన్స్ ఏ విషయంలోనూ డిసపాయింట్ అవ్వకుండా, వారికి ఎక్స్ట్రార్డినరీ ఫీలింగ్ ఇవ్వడానికే వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే..  సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనే అంశంపై ఇంకా  క్లారిటీ రాలేదు. బహుశా ఆగష్టులో ఈ సినిమా విడుదల ఉండవచ్చని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక వాయిదా విషయం తెల్సుకున్న షారూఖ్ ఫాన్స్ కొంచం డిసపాయింట్ అవుతున్నారు. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార  హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో..విజయ్ సేతుపతి, ప్రియమణి కీ రోల్స్ పోషిస్తున్నారు. షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.