శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘మనమే’. శుక్రవారం ఈ మూవీ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. జూన్ 7న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్తో సూట్లో మోడరన్గా కనిపించాడు
శర్వానంద్. కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్ ఆదిత్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ డైలాగ్స్ రాశారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు.