నాకే ఓటేస్తరు కదా..! : శశిధర్ రెడ్డి

నాకే ఓటేస్తరు కదా..! : శశిధర్ రెడ్డి

పద్మారావునగర్, వెలుగు : ఆయన బీఆర్ఎస్​ పార్టీకి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే. పైగా జరగబోయే ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. అయితే, బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి ఏకంగా ఆయన నివాసానికే వచ్చి తనకు ఓటేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కోరారు. రాజకీయాల్లో ప్రత్యర్థులైన వీళ్లిద్దరి మధ్య బుధవారం జరిగిన భేటీ ఆసక్తికరంగామారింది. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ అదే సెగ్మెంట్ నుంచి ఈసారి కూడా పోటీ చేస్తున్నారు.

ఈయన నివాసంతో పాటు ఓటు కూడా సనత్​నగర్​లో ఉంది. సనత్​నగర్​లో బీజేపీ నుంచి మర్రి శశిధర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన బుధవారం ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పద్మారావు గౌడ్ నివాసానికి వెళ్లిన శశిధర్ రెడ్డి.. కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఆయన వెంట మోండా మార్కెట్ కార్పొరేటర్ దీపిక తదితరులు ఉన్నారు.