భర్తకు గుడి కట్టి..నిత్యం పూజలు చేస్తుంది

భర్తకు గుడి కట్టి..నిత్యం పూజలు చేస్తుంది

ప్రకాశం జిల్లా: భర్త చనిపోయాక కూడా ఆయన పేరుతో సేవలు చేస్తూ అందరి చేత ప్రశంసలు అందుకుంటుంది ఓ మహిళ. చనిపోయిన భర్తకు గుడి కట్టి పూజలు చేస్తుంది. ఆయన వర్ధంతి రోజుల సేవా కార్యక్రమాలు చేస్తుంది.  ప్రకాశం జిల్లా పొదిలి(మ)నిమ్మవరంకు చెందిన అంకిరెడ్డి,పద్మావతి భార్యాభర్తలు. అంకిరెడ్డి నాలుగేళ్ళ క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోగా..ఆయన్ను స్మరించుకోవాలని భర్త పాలరాతి విగ్రహం ప్రతిష్టించి, గుడి కట్టించింది. నిత్యం పూజలు చేస్తోంది. అంతేకాదు గుడిలో అప్పుడప్పుడూ పేదలకు అన్నదానం చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తోంది. పతియే ప్రత్యక్ష దైవం అని పెద్దలు అంటారు. ఈ ఇల్లాలు ఇదే సూత్రం పాటిస్తోందంటున్నారు గ్రామస్థులు.