కాంగ్రెస్​కు 58 నుంచి 67 సీట్లు వస్తయ్ : ఎండీ షేక్​ మస్తాన్

కాంగ్రెస్​కు 58 నుంచి 67 సీట్లు వస్తయ్ : ఎండీ షేక్​ మస్తాన్

ఖైరతాబాద్​, వెలుగు:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తమ సంస్థ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్​ పార్టీకి అధికారం దక్కనున్నట్లు ఆరా సంస్థ  ఎండీ షేక్​ మస్తాన్​ చెప్పారు. గురువారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నిర్వహించిన తమ సర్వేలో కాంగ్రెస్​ పార్టీకి 58 నుంచి 67 సీట్లు వస్తాయన్నారు.

అధికార బీఆర్​ఎస్​ పార్టీ 41నుంచి 49 రావచ్చని చెప్పారు. బీజేపీకి 5–7 సీట్లు రావచ్చని.. మజ్లిస్​, బీఎస్పీ, సీపీఐ మూడు పార్టీలకు 7–9 సీట్లు వస్తాయని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా తమ అంచనాలను వెల్లడించారు. తాము తమ సిబ్బంది ద్వారా ఈ  సర్వేను గ్రౌండ్​ లెవెల్​ నుంచి చేయించామని ఆయన చెప్పారు.